TSPSC: గ్రూప్-4 ఉద్యోగాలకు ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు 9 లక్షలు దాటాయి. గురువారం సాయంత్రానికి 9,15,872 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-4 పరీక్షల తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 2023 జూలై 1వ తేదీ ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించనుంది.ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు … Read more