AP EAPCET Results 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో EAPCET ఫలితాలను విడుదల చేశారు. జులై 1వ తారీఖున విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలు విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో ఎంసెట్ పరీక్షలు రాసిన అభ్యర్థుల యొక్క ఫలితాలు విడుదల చేశారు. విద్యార్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ మొబైల్ లోనే ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు. అభ్యర్థుల యొక్క ఫలితాలతో పాటు, ర్యాంక్ కార్డులను కూడా విడుదల చేశారు.
మే 12వ తారీకు నుంచి 20వ తారీకు వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,76,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… 2,58,545 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,82,317 మంది క్వాలిఫై అయ్యారు. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… 70,929 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 63,546 మంది క్వాలిఫై అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 70.52 శాతం మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 89.59 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.



