AP EAPCET 2025 Results: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
AP EAPCET 2025 Results
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ 2025 ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు AP EAPCET 2025 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రసాద్ గారు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 75.67% మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్లు తెలిపారు.
మే 19 నుంచి 27 వరకు పరీక్షలను నిర్వహించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 75,460 మంది పరీక్ష రాస్తే 67,761 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,64,840 మంది పరీక్ష రాస్తే 1,89,748 మంది అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని 145 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహించారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు