December 24, 2025
All India Govt Jobs

రైల్వే శాఖలో 10th అర్హతతో కానిస్టేబుల్, డిగ్రీ అర్హతతో ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RPF SI Constable Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RPF Notification 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) & రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,660 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) & రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 2వ తారీకున విడుదలైన ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 4,660 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ 452 పోస్టులు, కానిస్టేబుల్ 4,208 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తారీకు నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

సబ్ ఇన్స్పెక్టర్: 452 పోస్టులు
కానిస్టేబుల్: 4,208 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 4,660

సబ్ ఇన్స్పెక్టర్: 2024 జులై 1వ తారీకు నాటికి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కానిస్టేబుల్: 2024 జులై 1వ తారీకు నాటికి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

SC/ST/BC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

సబ్ ఇన్స్పెక్టర్: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు .

కానిస్టేబుల్: 10th క్లాస్ విద్యార్హతను కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సబ్ ఇన్స్పెక్టర్: రూ.35,400/-
కానిస్టేబుల్: రూ.21,700/-
ఈ జీతంతో పాటు రైల్వే శాఖ నిబంధనల ప్రకారం అన్ని రకాల అలవెన్సులు వర్తిస్తాయి.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ టెస్టులు(PET & PMT), మెడికల్ టెస్టులు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.500/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/ఈబీసీ/ మహిళా అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి.

2024 ఏప్రిల్ 15వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవాలి .

2024 మే 14వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!