December 23, 2025
TS Govt Jobs

TSPSC: గ్రూప్-4 ఉద్యోగాలకు ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు 9 లక్షలు దాటాయి. గురువారం సాయంత్రానికి 9,15,872 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-4 పరీక్షల తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 2023 జూలై 1వ తేదీ ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించనుంది.
ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఇటీవల అదనంగా 141 పోస్టులను కలిపారు. దీంతో మొత్తంగా 8,180 గ్రూప్ 4 పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Apply Online

Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!