TGPSC: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రేపటి రోజు (జనవరి 16న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు మొత్తం 1370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 2024 నవంబర్ 17, 18 తేదీల్లో ఈ ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత పరీక్షలను నిర్వహించింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన 1370 మంది అభ్యర్థులకు జనవరి 16న హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నారు.
మొత్తం 1388 గ్రూప్-3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీజీపీఎస్సీ 2025 మార్చి 14న విడుదల చేసింది. తరువాత అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక పూర్తి చేసింది.
