April 16, 2025
All India Govt Jobs

RRB Group-D: 32,438 రైల్వే గ్రూప్-డి ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు.. అర్హత: 10వ తరగతి

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి లెవెల్-1 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి నేడే ఆఖరు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 1వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు గతంలో ఫిబ్రవరి 22వ తారీకు వరకు ఉండేది.. తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ దరఖాస్తు గడుగును 2025 మార్చి 1వ తారీకు వరకు పొడిగించడం జరిగింది.

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉన్న 1,642 ఖాళీ పోస్టులకు ఏపీ, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

Level-1 గ్రూప్-D: 32,438 పోస్టులు

సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్లో 1,642 ఖాళీ పోస్టులు ఉన్నాయి.

👉విద్యార్హతలు: 

పోస్టులను అనుసరించి 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఐటిఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

👉వయోపరిమితి: 

18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

నెలకు రూ.18,000 జీతం ఉంటుంది. జీతంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్స్ లు ఉంటాయి

👉ఎంపిక విధానం:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉సిలబస్:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 90 నిమిషాలు సమయం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: 

అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 23వ తారీకు నుంచి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

ఓసి, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ కమ్యూనిటీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

01-03-2025 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Apply Online

Official Website

✅నిరుద్యోగుల కోసం: RRB Group-D “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!