AP Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీకి జాబ్ మేళా నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు లోని “శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ” నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 13 కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొన్ననున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పలు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు భర్తీకి జాబ్ మేళా నోటిఫికేషన్ విడుదలైంది.
విద్యార్హతలు
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
వయోపరిమితి
18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న యువతి, యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
ఎంపిక విధానం
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ
- 23-06-2026 తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి
- ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత పత్రాలును వెంట తీసుకొని వెళ్ళవలెను
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము
ఎన్టీఆర్ జిల్లా: Sree Vahini Institute of Science and Technology, Tiruvuru, NTR District.
