December 24, 2025
AP Govt Jobs

APPSC: ఏపీలో గ్రూప్-2 లాంటి మరో నోటిఫికేషన్ విడుదల.. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు | ఒకే సిలబస్, ఒకే జీతం, ఒకే అర్హత, ఒకటే ఎంపిక విధానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 లాంటి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల. ఒకే సిలబస్, ఒకే అర్హత, ఓకే జీతం, ఒకటే ఎంపిక విధానం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ.

Download Our App

డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 20 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత, వయస్సు, జీతం, సిలబస్, ఎంపిక విధానం.. పూర్తిగా గ్రూప్-2 ఉద్యోగాలకు ఉండే విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 జనవరి 12వ తారీకు నుంచి 2024 ఫిబ్రవరి 1వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు.. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. అర్హత, వయస్సు, జీతం, సిలబస్, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

జూనియర్ అసిస్టెంట్: 20 పోస్టులు

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.25,220/- నుంచి రూ.80,910/- వరకు

ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు.. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

స్క్రీనింగ్ టెస్ట్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో టాపిక్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1 & పేపర్-2) ఉంటాయి. ప్రతి పేపర్ నుంచి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2 పరీక్షలో భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్ పరీక్షలను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
http://apysruhsjar.aptonline.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

2024 జనవరి 12వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు

2024 ఫిబ్రవరి 1వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Notification Link

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!