May 13, 2024
AP Govt Jobs

APPSC: గ్రూప్-2 బిగ్ అలర్ట్.. ఆలస్యం చేయకండి

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు మరో రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 52 శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు మరో 2 రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 17వ తారీకు వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను 2024 ఫిబ్రవరి 25వ తారీకున నిర్వహించనున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.

ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 331
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566
మొత్తం పోస్టుల సంఖ్య: 897
Note: కేటగిరీల వారీగా, శాఖల వారీగా, జోన్ల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకు పై క్లిక్ చేయండి.

2023 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Note: సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 పోస్టులకు 20 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టును అనుసరించి నెలకు రూ.25,220/- నుంచి రూ.1,30,580/- వరకు జీతం ఉంటుంది.

స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నిర్వహిస్తారు.
Note: ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తో పాటు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఫిజికల్ టెస్టుల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫీజు: రూ.250/-
పరీక్ష ఫీజు: రూ.80/-
SC/ST/BC అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 డిసెంబర్ 21వ తారీకు నుంచి 2024 జనవరి 17వ తారీకు వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

స్క్రీనింగ్ టెస్ట్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో టాపిక్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1 & పేపర్-2) ఉంటాయి. ప్రతి పేపర్ నుంచి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2 పరీక్షలో భారత దేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్ పరీక్షలను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు.

Notification Link

Group-2 Syllabus

Official Website

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!