APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23 కు వాయిదా!.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2 Mains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23వ తారీకున నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది.

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

Whatsapp Group Link

Telegram Group Link

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ఈరోజు (మంగళవారం) అధికారిక వెబ్సైట్లో వెబ్ నోట్ విడుదల చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జనవరి 5వ తారీఖున నిర్వహించాలి. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకుని.. అలాగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ తేదీని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ గతంలో వెల్లడించింది. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడడంతో పాటు, అభ్యర్థుల నుంచి వస్తున్న వినతుల మేరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

గత కొద్దిరోజులుగా గ్రూప్-2 అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్న విషయం తెలిసిందే. ప్రిపరేషన్ కు కనీసం మూడు నెలల గడువు ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా డిసెంబర్ చివరి వారంలో కానిస్టేబుల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న కారణంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!