APPSC Group 2: గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, జీతం, సిలబస్, ఫిజికల్ టెస్ట్ వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో మొత్తం 900 పైగా గ్రూప్-2 పోస్టులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అనుమతి తెలిపింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Download Our App

900 గ్రూప్-2 ఉద్యోగాల్లో ఎక్సైజ్ శాఖ నుంచి 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్: 150 పోస్టులు
(Note: నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి ఈ పోస్టులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది.)

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రూ.40,970 నుంచి రూ.1,24,380 వరకు

పురుష అభ్యర్థులకు:
హైట్ – 165 c.m.
చెస్ట్ – 81 c.m. ( ఊపిరి పీల్చినపుడు 5 సెంటీమీటర్లు పెరగాలి)

మహిళా అభ్యర్థులకు:
హైట్ – 152.5 c.m.
వెయిట్ – 45.5 kgs.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

ప్రిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్క్రీనింగ్ టెస్ట్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో టాపిక్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1 & పేపర్-2) ఉంటాయి. ప్రతి పేపర్ నుంచి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2 పరీక్షలో భారత దేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్ పరీక్షలను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు.

Group-2 Syllabus

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!