December 23, 2025
AP Govt Jobs

APPSC Group 2: ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహణ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2 Mains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23వ తారీకున నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) యోచిస్తోంది.

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జనవరి 5వ తారీఖున నిర్వహించాలి. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకుని.. అలాగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ తేదీని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ గతంలో వెల్లడించింది. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడడంతో పాటు, అభ్యర్థుల నుంచి వస్తున్న వినతుల మేరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించాక అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

గత కొద్దిరోజులుగా గ్రూప్-2 అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్న విషయం తెలిసిందే. ప్రిపరేషన్ కు కనీసం మూడు నెలల గడువు ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా డిసెంబర్ చివరి వారంలో కానిస్టేబుల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న కారణంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు.

✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!