April 14, 2025
AP Govt Jobs

APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 1:100 నిష్పత్తిలో ఫలితాలు విడుదలకు నిర్ణయం

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఏపీపీఎస్సీ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాబోయే వారం రోజుల లోపు 1:100 నిష్పత్తికి సంబంధించిన నిర్ణయాన్ని ఏపీపీఎస్సీ అధికారికంగా తెలియజేయునున్నది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయిన పరిగే సుధీర్ గారు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని.. గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థులతో పాటు, నిరుద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఏపీపీఎస్సీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల అభ్యర్థన మేరకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయడానికి ఏపీపీఎస్సీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని అధికారికంగా వారం రోజులలో ఏపీపీఎస్సీ వెల్లడించనుంది. ఈ కారణంగా కటాఫ్ మార్కులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.

Whatsapp Group Link

Telegram Group Link

Download Our App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!